కువైట్, ఖతార్ లలో మూతికి మాస్క్ ను తప్పకుండా ధరించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఎవరైనా మాస్క్ లేకుండా పట్టుబడితే మూడు నెలల కఠిన కారాగార శిక్ష ఉంటుందని ఆదేశాలలో పేర్కొన్నారు. కువైట్ లో మాస్క్ లేకపోతే 5 వేల దీనార్లు అంటే దాదాపుగా 16,200 డాలర్ల జరిమానా విధిస్తారు. కతార్ లో రెండు లక్షల రియా లను జరిమానా గా విధిస్తారు. అంటే దాదాపుగా 55 వేల డాలర్లు.
ఆరు గల్ఫ్ దేశాలలో ముందుగా కరోనా వైరస్ యాత్రీకుల నుంచి వచ్చిందని భావించారు. అయితే అది క్రమేపీ వలస కార్మికులకు సోకింది. వలస కార్మికుల నుంచి కరోనా వైరస్ దారుణంగా వ్యాపిస్తున్నది. దాంతో ఈ దేశాలు కఠిన చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించాయి. సౌదీ అరేబియా, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కరోనా వైరస్ తో విలవిలలాడుతున్నాయి.