38.2 C
Hyderabad
May 3, 2024 21: 28 PM
Slider మహబూబ్ నగర్

శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న కొల్లాపూర్ సేవా సమితి చైర్మన్ రంగినేని

#rangineni

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో పలు ప్రాంతాలలో వైభవంగా జరిగిన శరన్నవరాత్రి ఉత్సవాలలో కొల్లాపూర్ సేవా సమితి చైర్మన్ రంగినేని అభిలాష్ రావు పాల్గొన్నారు. జటప్రోలు మున్సిపాలిటీ పరిధిలోని చుక్కాయిపల్లి గ్రామం, అదేవిధంగా 6వ వార్డ్ లోని వాసవి కన్యకాపరమేశ్వరి దేవి ఆలయంలో వెలసిన దుర్గామాత తల్లిని అభిలాష్ రావు  దర్శించుకున్నారు.

కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డ్ రాజవిధి కాలనిలోని వాసవి కన్యకాపరమేశ్వరి దేవి ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు అభిలాష్ రావు  ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. దుర్గామాత దేవిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు .కమిటీ సభ్యులు అభిలాష్ రావు కు సన్మానం చేశారు. వారికి అభిలాష్ రావు  ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

చుక్కాయిపల్లి గ్రామంలో కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు దుర్గామాతను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కమిటీ సభ్యులు అభిలాష్ రావుకు  సన్మానం చేయడం జరిగింది. పెంట్లవెల్లి మండలం, జటప్రోల్ గ్రామంలో  కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు దుర్గాదేవి అవతారంలో ఉన్న దుర్గామాత తల్లిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా అన్నదానం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నియోజవర్గంలోని ప్రజలందరూ పాడిపంటలతో సుఖసంతోషంగా కలసిమెలసి ఉండాలని ఆ దేవి ఆశీస్సులు ఎల్లపుడూ మనందరిపైన ఉండాలని దుర్గామాత దేవిని రంగినేని అభిలాష్ రావు  వేడుకున్నారు.

Related posts

హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ముందస్తు అరెస్ట్

Satyam NEWS

షూటింగ్ లో జాతీయ పోటీలకు ఎంపికైన బిసి గురుకుల స్కూల్ విద్యార్థి మౌనిక

Bhavani

పల్లె పల్లె కదలి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

Satyam NEWS

Leave a Comment