వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చన్గోముల్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకున్నది. 10 ఏళ్ళ బాలికపై బాబాయి వరుస అయిన రాజు అనే వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. మామిడి కాయలు తీసుకొద్దామని పొలానికి తీసుకెళ్లిన అతను ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాలిక కేకలు వేయడంతో భయపడి వదిలేశాడు. ఈ అఘాయిత్యం విషయం ఎవరికి చెప్పొదంటూ డబ్బులు ఆశ చూపే ప్రయత్నం చేశాడు. అయితే బాధిత కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
previous post