హైదరాబాద్ లోని గోల్నాక డివిజన్ లోని చాదర్ ఘాట్ లోని రేణుక ఎల్లమ్మ దేవాలయంలో రేణుక ఎల్లమ్మ కల్యాణం ఎంతో వైభవంగా జరిగింది.
ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆరెల్లి అంజయ్య(బిక్షపతి) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ తోలి ఏకాదశీ సందర్భంగా రేణుక ఎల్లమ్మ దేవాలయం భక్తులతో కిటకిటలాడంది.
ఈ కల్యాణానికి వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు, ప్రజాప్రతినిధుల, నాయకులు, పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు అంజయ్య వారిని శాలువలతో సత్కరించారు.
ఈ కల్యాణ వేడుకలో ఆలయ కమిటీ సభ్యులు ఆరెల్లి కుటుంబ సభ్యులు సురేందర్, గోల్నాక డివిజన్ మాజీ కార్పోరేటర్ కాలేరు పద్మావెంకటేష్, బీజేపీ నగర ఉపాధ్యక్షుడు కన్నె రమేష్ యాదవ్, బీజేపే నాయకులు, వార్డ్ మెంబర్ దోర్నాల భరత్ రాజ్ ముదిరాజ్, పల్లవి, ధనలక్ష్మి, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. సత్యం న్యూస్, అంబర్ పేట్