కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలో పోలీస్ మీ కోసం కార్యక్రమంలో భాగంగా ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ సూచనల మేరకు డీఎస్పీ శ్రీనివాస్ సిఐ అల్లం నరేందర్ ఆధ్వర్యంలో సమర్టియన్స్ ఆఫ్ ది నేషన్స్ స్వచ్ఛంద సేవ సహకారంతో మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నెప్లైజర్ కిట్, బీపీ ఆపరేటర్, గ్లూకోమీటర్ అందజేశారు.
అదేవిధంగా మండలంలోని రాజగుడ, గుండాల గ్రామం, క్వొతగామ్ గ్రామంలో 5000 లీటర్ల వాటర్ ట్యాంకులను రెండిటినీ నిర్మించి ప్రారంభించడం జరిగిందని తిర్యానీ ఎస్ఐ సిహెచ్ రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్లప్పుడు పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కరిస్తామని తెలిపారు. మారుమూల ప్రాంతాల ప్రజలు అసాంఘిక శక్తుల వైపు ఆకర్షితులు కాకుండా మెరుగైన సమాజం కోసం తమ వంతు పాత్రను పోషించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సమర్టియన్స్ ఆఫ్ ది నేషన్స్ సభ్యులు పి వీ ప్రసాద్, రాము పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.