30.7 C
Hyderabad
May 5, 2024 06: 07 AM
Slider మహబూబ్ నగర్

సేవారత్న నేషనల్ అవార్డుకు ఎంపికైన రత్నకుమారి

సేవారత్న నేషనల్ అవార్డు – 2022 సంవత్సరమునకు గాను ప్రముఖ సంఘ సేవకురాలు రాజ్ కుమార్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు రత్న కుమారి ఎంపికైనట్లు జాతీయ అవార్డు కమిటివారు ప్రకటించారు. అవార్డు సెలెక్షన్ కమిటి నేషనల్ చైర్మన్ మరియు బీ ఎస్ ఏ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ అవార్డు ఆహ్వాన పత్రాన్ని హైదరాబాద్ లోని బహుజన సాహిత్య అకాడమి జాతీయ కార్యాలయములో అందజేశారు. ఈ సందర్భంగా నల్లా రాధాకృష్ణ మట్లాడుతూ ఎస్.సి.,

ఎస్.టి., బి.సి, మైనారిటీల సాహిత్యాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం బహుజన సాహిత్య అకాడమి వారు ప్రతి ఏట ప్రజా ఉద్యమకారులకు, సంఘసేవకులకు, రచయితలకు, కవులకు మరియు స్వచ్ఛంద సంస్థలకు ఈ అవార్డును అందజేయనున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ సంవత్సరం నవంబర్ 13వ తేదిన దేశ రాజధాని న్యూ ఢిల్లీలో జరిగే ఆల్ ఇండియా బహుజన రైటర్స్ 3వ నేషనల్ కాన్ఫరెన్స్ సందర్భంగ సేవారత్న నేషనల్ అవార్డును అందజేయనున్నట్లు తెలియజేశారు. ఆల్ ఇండియాలోని 26 రాష్ట్రాల నుండి సుమారుగా 2000 మంది డెలిగేట్స్ ఈ కాన్ఫరెన్స్కీ హాజరవుతారని తెలియజేశారు. ఈ అవార్డ్ లెటర్ అందజేసిన వారిలో బీ ఎస్ ఏ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు యం.యం. గౌతమ్, రాష్ట్ర కో-ఆర్డినేటర్ హనుమాండ్ల విష్ణు అవార్డు నెలెక్షన్ కమిటి మెంబర్ తదితరులు పాల్గోన్నారు.

Related posts

విజయనగరం పైడితల్లి ఆలయ విస్తరణ కు తొలగిన అడ్డంకులు

Bhavani

మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి ఈఎస్ఐ ఉచ్చు?

Satyam NEWS

రాజంపేట క్వారంటైన్ వద్ద స్థానిక ప్రజల ఆందోళన

Satyam NEWS

Leave a Comment