కడప జిల్లా రాజంపేటలోని క్వారంటైన్ బాలికల వసతి గృహం సోమవారం వద్ద స్థానికుల ధర్నా నిర్వహించారు. ఇతర ప్రదేశాలకు చెందిన కరోన అనుమానిత వ్యక్తులను ఇక్కడ చేర్పిస్తున్నారని స్థానికులు ఆరోపణ చేస్తున్నారు. తక్షణం క్వారంటైన్ మూసివేయాలని స్థానికుల ఆందోళన కు దిగారు.
ఇప్పటి వరకు రాజంపేటలో కరోనా పాజిటివ్ లు లేవని వీరి మూలంగా ఇతరులకు వచ్చే అవకాశం ఉందని స్థానిక ప్రజలు పెద్ద యెత్తున క్వారంటైన్ వద్దకు చేరుకొని ధర్నా చేపట్టారు. ధర్నా చేస్తున్న ప్రజలకు పోలీసులు సర్దిచెప్ప డానికి ప్రయత్నాలు చేసారు. స్వయంగా డిఎస్పీ నారాయణ స్వామి రెడ్డి రంగంలోకి దిగి ఆందోళన వ్యక్తం చేస్తున్న వారికి నచ్చ చెప్పారు.
క్వారంటైన్ లో ఉన్న వారికి పాజిటివ్ లేదని వారిని పర్యవేక్షణ లో ఉంచామని అపోహాలు, పుకార్లు నమ్మ వద్దని వారికి నచ్చ జెప్పారు. అటువంటి వారిని ఇక్కడ ఉంచామని వారికి హామీ ఇచ్చారు. దానితో ఆందోళన చేస్తున్న వారు శాంతించారు. అక్కడ నుంచి వెళ్లిపోయారు.