హైదరాబాద్ లోని అంబర్ పేట్ లోని దేవస్థాన సేవ సమితి రావణ దహనం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది.
అంబర్ పెట్ మున్సిపల్ గ్రౌండ్ లో నిర్వహించిన ఈ రావణ దహనానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు వీ హనుమంతరావు, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, అంబర్ పేట్ కార్పొరేటర్ ఈ.విజయ్ కుమార్ గౌడ్, గోల్నాక కార్పొరేటర్ దూసరి శ్రీనివాస్ గౌడ్, బాగ్ అంబర్ పేట్ కార్పొరేటర్ పద్మా వెంకట్ రెడ్డి, నల్లకుంట కార్పొరేటర్ అమృత, కాచిగూడ కార్పొరేటర్ కన్నె ఉమ్మ రమేష్ యాదవ్ తదితరులు హాజరయ్యారు.
అదే విధంగా టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సిద్ధార్థ ముదిరాజ్, జాకీ బాబు, మహేష్ ముదిరాజ్, నాగరాజు, రంగు ఉదయ్ గౌడ్, సంతోష్ చారి, దినేష్ తదితరులు పాల్గొన్నారు.