హైదరాబాద్ లోని ఉప్పల్ న్యూ శాంతినగర్ 2 లో శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ సీతారామ కళ్యాణ మండపానికి ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఉప్పల్ మున్సిపల్ చైర్మన్ మేకల శివారెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరై సీతారామ కళ్యాణ మండపం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీతారామాంజనేయ స్వామి దేవుని ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, గడ్డం రవి కుమార్, మేకల మధుసూదన్ రెడ్డి, చింతల నరసింహ రెడ్డి, గోరిగే ఐలేష్, న్యూ శాంతినగర్ కాలనీ 2 గౌరవ అధ్యక్షులు మన్నె సిద్ధిరాములు, అధ్యక్షులు పబ్బతి వెంకటేష్, ప్రధాన కార్యదర్శి బాదే ఆంజనేయులు ,కోశాధికారి రోశయ్య, సలహాదారుడు కావలి శ్రీనివాస్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.