పల్నాడు జిల్లా తొలి ఎస్పీ గా వై రవి శంకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఎంతో చారిత్రక నేపథ్యం గల పల్నాడు జిల్లా నరసరావుపేట కి మొదటి ఎస్పీ గా ఛార్జ్ తీసుకోవడం గర్వకారణంగా భావిస్తున్నాను అని ఈ సందర్భంగా రవి శంకర్ రెడ్డి అన్నారు.
జిల్లాకు ఉన్న ప్రత్యేకత అప్పట్లోనే చాపకూటి సిద్ధాంతాన్ని తీసుకువచ్చిన సమాజమని, కులమతాలకు జాతికి అతీతంగా ప్రజలందరూ ఒక్కటేనని చాటిచెప్పిన జిల్లా ఇది అని ఆయన అన్నారు. ఇక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందన్నారు.