ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం టీఆర్ఎస్ పార్టీ మండల మీడియా ఇంచార్జిగా పిఎసియాస్ చైర్మన్,తెలంగాణ రాష్ట్ర మలి ఉద్యమకారుడు కునూరు అశోక్ గౌడ్ ను నియమిస్తూ ములుగు టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,జడ్పీ చైర్ పర్సన్ కుసుమ జగదీష్ ఉత్తర్వులు జారీచేశారు.
తెలంగాణ రాష్ట్ర మలి దశ ఉద్యమంలో అశోక్ గౌడ్ కీలకపాత్ర పోషించారు. ప్రజలు ఆశీర్వాదం తో పిఎసియాస్ చైర్మన్ గా ఆయన ప్రజా సేవలో ఉన్నారు. ములుగు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ నమ్మకంతో తనకు ఈ బాధ్యతలు అప్పగించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.