సంక్రాంతి సందర్భాన్ని పురస్కరించుకుని ‘డిస్కోరాజా’ నుంచి ఒక టీజర్ ను వదిలారు దర్శకుడు వీఐ ఆనంద్ “సోల్జర్స్ సంవత్సరాల పాటు బాంబింగ్స్ తోను ఫైరింగ్స్ తోను యుద్ధాలు చేసి, రిటైరై ఇంట్లో వుంటే సడన్ గా వచ్చే సైలెన్స్ ఉంటది చూడు, అది అప్పటిదాకా వాళ్లు చూసిన వయొలెన్స్ కంటే కూడా భయంకరంగా వుంటది” అనే వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ మొదలవుతోంది.
హీరో విలన్ కాంబినేషన్స్ లోని సన్నివేశాలపై కట్ చేసిన ఈ టీజర్ ఆకట్టుకునేలా వుంది.విభిన్నమైన కథలను ఎంచుకుని వాటిని తనదైన స్టైల్ లో తెరపై కెక్కించే దర్శకుడుగా పేరున్న వీఐ ఆనంద్ తన తాజా చిత్రంగా ‘డిస్కోరాజా’ సినిమాను రూపొందించాడు. నభా నటేశ్ ,పాయల్ , తాన్యా హోప్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాను ఈ నెల 24వ తేదీన విడుదల చేయనున్నారు.