‘సరిలేరు నీకెవ్వరు’ బ్లాక్ బస్టర్ హిట్ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తమ ఫ్యాన్స్ కి బంపర్ ఆఫర్ ఇచ్చారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకి తాను స్వయంగా సమాధానమిస్తానని తన ట్విట్టర్ లో తెలిపాడు. తాను నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ బ్లాక్ బస్టర్ హిట్ గా మలిచిన అభిమానులకు అయన కృతజ్ఞతలు తెలిపారు.
ట్విట్టర్ వేదికగా, ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పనున్నానని ప్రకటించారు. ఈ మేరకు తన ట్విట్టర్ లో ఓ ట్వీట్ పెట్టారు. ఫ్యాన్స్ తనపై ప్రశ్నలను సంధించాలని కోరారు.