కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ నటుడు కృష్ణంరాజు(83) తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కృష్ణంరాజు మరణించారని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కృష్ణంరాజు కన్నుమూశారు.
తెల్లవారుజామున 3.25 గంటలకు కృష్ణంరాజు తుది శ్వాస తీసుకున్నారు. వాజ్పేయి హయాంలో కేంద్రమంత్రిగా ఆయన పని చేశారు. తెలుగు చిత్రసీమలో రెబెల్ స్టార్గా పేరొందిన కృష్ణంరాజు పలు చిత్రాలలో నటించారు. 1940 జనవరి 20న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు జన్మించారు. హీరోగా సినీరంగ ప్రవేశం చేసి విలన్గానూ ఆయన అలరించారు. చదువు పూర్తి కాగానే కొన్నాళ్లు జర్నలిస్టుగా కూడా కృష్ణంరాజు పని చేశారు.