నెల్లూరు జిల్లా వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మకి కోటి 25 లక్షల రూపాయలతో చేయించిన స్వర్ణాభరణాలు అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో పాలుపంచుకోవడం తన పూర్వజన్మ సుకృతం అని తిరుపతి ఎంపీ గురుమూర్తి తెలియజేశారు.
ఇంత గొప్ప కార్యక్రమానికి తను ఆహ్వానించిన స్థానిక శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి కి, ఆలయ కమిటీకి, దేవాదాయ శాఖ అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. పుర ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో సంతోషంగా పోలేరమ్మ జాతర జరుపుకోవాలని, ఆ తల్లి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
తిరుపతి పార్లమెంటు పరిధి తిరుపతి నగరంలో గంగమ్మ తల్లి, వెంకటగిరిలో పోలేరమ్మ తల్లి, కనుపూరులో ముత్యాలమ్మ తల్లి, సూళ్లూరుపేటలో చెంగాళమ్మ తల్లి వంటి మహిమ గల దేవతలు జిల్లా నలువైపుల భక్తుల కొంగు బంగారంగా కొలువుదీరారని ఆయన అన్నారు.