కర్ణాటకలోని బెళగావి జిల్లాలో రోడ్డు మధ్యలో భజరంగ్ దళ్ కార్యకర్తలు కత్తులతో డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో వైరల్ అయిన అనంతరం కర్ణాటక పోలీసులు స్పందించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామంటూ తెలిపారు.
ఈ ఊరేగింపులో భజరంగ్ దళ్ సభ్యులెవరూ కోవిడ్ -19 ప్రోటోకాల్ పాటించలేదు. మాస్కులు ధరించలేదు..భౌతిక దూరం పాటించలేదు. ఈ వీడియో వైరల్ అయిన తరువాత పలువురు నెటిజన్లు.. ట్విట్టర్లో కర్ణాటక ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. వీరిపై చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్లు డిమాండ్ చేశారు.
ఆయుధ పూజ సందర్భంగా భజరంగ్ దళ్ సభ్యులు పీరన్వాడిలో ఊరేగింపు నిర్వహించారు. డీజే పాటకు అనుగుణంగా భజరంగ్ సభ్యులు కత్తులతో నృత్యం చేశారు. అయితే.. ఈ కార్యక్రమం పోలీసు భద్రతా నడుమ జరిగిందని.. కోవిడ్ నిబంధనలు ఉన్నప్పటికీ ఎవరూ పాటించలేదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.