Slider మహబూబ్ నగర్

ఆదివాసీలకు ఉచిత వైద్యం అందించిన రెడ్ క్రాస్ సంస్థ

#nagarkurnool collector

నాగర్ కర్నూల్ ఆదివాసీలయిన చెంచు సోదరుల పెంటల్లో వెళ్లి వారికి మెరుగైన వైద్య సేవలను అందించాలనే తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ ఆకాంక్షల మేరకు పాలమూరు యూనివర్సిటీ, రెడ్ క్రాస్ వారి సౌజన్యంతో లింగాల మండలం భౌరపూర్ చెంచుపెంటలో  ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసిందని జిల్లా కలెక్టర్ యల్. శర్మన్ అన్నారు.

బుధవారం  భౌరపూర్ చెంచు పెంటలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఏర్పాటు చేసిన ఉచిత మెగా మల్టీ లెవల్ వైద్య శిబిరానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లాలోని నల్లమల్ల అడవుల్లోని చెంచుపెంటల్లో జీవిస్తున్న చెంచులకు మెరుగైన వైద్యం,  నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో గవర్నర్ దత్తత తీసుకోవాల్సిందిగా పాలమూరు యూనివర్సిటీ, రెడ్ క్రాస్ సంస్థను ఆదేశించడం జరిగిందన్నారు. చెంచుల ఆచార వ్యవహారాలు, వారి జీవన స్థితిగతులపై లోతైన అధ్యయనం చేసి మెరుగైన అవకాశాలను కల్పించడానికి ఇప్పటికే రెడ్ క్రాస్ సంస్థ, సామాజిక సేవా సంస్థలు ఇక్కడికి తరచుగా సందర్శించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

చెంచు సోదరులకు మెరుగైన విద్యా  వైద్యం ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.  వైద్య శిబిరానికి నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, హైద్రాబాద్ నుండి అన్ని రకాల స్పెషలిస్ట్ డాక్టర్లు 29 మంది రావడం జరిగిందన్నారు. ఇందులో కార్డియాలజిస్ట్, పిడియాట్రిక్, గైనకలజిస్ట్, ఆర్థో, కంటి, పంటి, జనరల్ ఫిజిషియన్లు  ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లు ఉన్నారన్నారు.

అనేక రకాల మందులు, కరోనా పరీక్షా కిట్లు, కరోన వ్యాక్సిన్, డయజ్ఞస్టిక్ సేవలు తీసుకురావడం జరిగిందన్నారు.  చెంచు సోదరులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని, డాక్టర్ల సూచనలు పాటిస్తూ క్రమం తప్పకుండా మందులు వేసుకోవాలని సూచించారు.  ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ప్రతి ఒకరు వ్యాక్సిన్ తీసుకోవాలని తెలియజేసారు.

చెంచుపెంటల్లో తాగునీటికి పైప్ లైన్ ద్వారా మంచినీరు ఏర్పాటు చేయడం జరిగిందని, ఎక్కడైనా సమస్యలు ఉంటే తక్షణమే మరమ్మతులు చేయించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మొబాయిల్ వాహనము ద్వారా వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. చెంచుల కోరిక మేరకు చెక్ డ్యాములు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలితజేశారు.

ఆంత్రోపాలజిస్టు లను పంపించి చెంచుల జీవన విధానం వారికి అవసరమైన సేవలను అధ్యయనం చేయిస్తామని తెలియజేసారు. అచ్ఛంపేట శాసన సభ్యులు , ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజ్ మాట్లాడుతూ  అంతరించిపోతున్న ఆదివాసిలు, చెంచులను వారి సంస్కృతిని కాపాడుకోటానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు.  ఇక్కడి కొంత మంది పిల్లలను చేవెళ్లలో చదివించడం జరుగుతుందన్నారు.

నీట్ వంటి జాతీయస్థాయి పోటీ పరోక్షలో అర్హత సాధించినట్లు వెల్లడించారు. చెంచుపెంటలను గ్రామ పంచాయతీలుగా మార్చటం జరిగిందని, వారే సర్పంచులుగా తమ గ్రామాలను అభివృద్ధి చేసుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.  చెంచుల అభ్యున్నతికి చట్టాలు ఉన్నప్పటికిని వారికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ లక్ష్మీకాంత్ రాథోడ్ మాట్లాడుతూ రాష్ట్ర గవర్నర్ తమిళ సై ఆదేశాల మేరకు చెంచుపెంటలను దత్తత తీసుకొని యూనివర్సిటీ సామాజిక కార్యకర్తల ద్వారా, ఎన్. ఎస్.ఎస్ ద్వారా క్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుచున్నాయన్నారు.గవర్నర్ కార్యాలయం లైజన్ ఆఫీసర్ సీతారాములు మాట్లాడుతూ రాష్ట్రం లోని వివిధ జిల్లాలలో ఉన్న చెంచు పెంటలను రాష్ట్ర గవర్నర్ దత్తత తీసుకోవడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమానికి ఐ.యం.ఐ రాష్ట్ర అధ్యక్షులు డా. లవకుమార్ రెడ్డి, కార్యదర్శి బి. నరేందర్ రెడ్డి, సీనియర్ ప్రొఫెసర్ డా. గుట్టు శ్రీనివాస్, నాగర్ కర్నూల్ జిల్లా  వైద్య అధికారి డా. సుధాకర్ లాల్, మహబూబ్ నగర్ జిల్లా  ఆస్పత్రిసూపరిండెంట్ డా. రాంకిషన్, ఐ.టి.డి.ఏ అధికారి అశోక్, డి.యఫ్.ఏ కిష్టా రెడ్డి, రెడ్ క్రాస్ నుండి లైన్ నటరాజ, రమేష్ రెడ్డి, పి.యు. ప్రొఫెసర్ మనోజ, స్థానిక సర్పంచ్ బాలగురువయ్య, గురువయ్య, పెద్దసంఖ్యలో చెంచులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

Big News: బెంగాల్ దంగల్

Satyam NEWS

హైదరాబాద్ లో జరిగిన మహిళా సాధికారత సమావేశంలో పాల్గొన్న ఈశ్వరి బాయి

Satyam NEWS

త్వరలో ఐఐటీ-జేఈఈ ఫోరం జేఈఈ (మెయిన్), అడ్వాన్స్డ్ గ్రాండ్ టెస్ట్స్

Satyam NEWS

Leave a Comment