కరోనా వైరస్ కు సంబంధించి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. శుక్రవారం బాగ్ అంబర్ పేట డివిజన్ పరిధిలోని సిఈ కాలనీ లో రెడ్ జోను ఎత్తివేసి ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రభుత్వం నిబంధనలు పాటించాలని కోరారు.
రెడ్ జోను ఎత్తివేసినంత మాత్రాన కరోనా వైరస్ అంతరించినట్లు కాదని, సామాజిక దూరం పాటిస్తూ అన్నిజాగ్రత్తలూ తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు శ్రీరాములు ముదిరాజ్, కనివేట నర్సింగ్ రావు ప్రసాద్ పలువురు నేతలు పాల్గొన్నారు.