వలస కార్మికులు, విద్యార్థులు, పర్యాటకుల కోసం రోజుకు 400 రైళ్లు నడిపించేందుకు రైల్వే శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. రైళ్లలో ప్రయాణించే సమయంలో ఖచ్చితంగా సామాజిక దూరం పాటించేలా నిబంధనలు రూపొందిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకు పోయిన విద్యార్థులు, పుణ్య క్షేత్రాల సందర్శన కు వెళ్లిన భక్తులు, పర్యాటకులు తదితరులకు ఊరట కల్పిస్తూ కేంద్ర హోం శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.
దీంతో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న తమ వారిని స్వస్థలాలకు తరలించడానికి, రైళ్ల ను నడపాలని వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వినతులు రావడంతో, కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.