ప్రధాన పుణ్య క్షేత్రమైన యాదాద్రి ముఖ్య అర్చకులు కొడకండ్ల మాధవాచార్యులు నిరుపేదలకు ఆకలి తీర్చే మహాకార్యాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని తన శక్తి మేరకు ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో మాధవాచార్యులు లాక్ డౌన్ ప్రారంభం అయిన నాటి నుంచి రోజు విడిచి రోజు సుమారు 200 మందికి ఆకలితీరుస్తున్నారు.
ఎవరి నుంచి చందాలు తీసుకోకుండా తనకు ఉన్నదాంట్లో నుంచి సాధ్యమైనంత మంది ఆకలి తీర్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. దేవస్థానంలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల నుంచి రక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న పోలీసులు, వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు కూడా మాధవాచార్యులు అందిస్తున్న ప్రసాదం స్వీకరిస్తున్నారు. ఇంట్లోనే శుచిగా, సుభ్రంగా చేసిన ఆహారాన్ని ప్యాక్ చేసి అందరికి అందచేస్తున్నారు. ఆకలి బాధ తెలిసిన వాడిగా తన వంతు సాయం అందిస్తున్నట్లు ఆయన సత్యం న్యూస్ కు తెలిపారు.