రెడ్ క్రాస్ స్థాపించి వందేళ్ల పూర్తయిన సందర్భంగా విజయనగరం జిల్లా కేంద్రంలో.. సైకిల్ ర్యాలీ ప్రారంభమైంది.
ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ కలెక్టరేట్ ప్రాంగణం నుంచీ ప్రారంభించారు. ఈ ర్యాలీ శ్రీకాకుళం నుంచీ విజయ వాడ వరకూ నిర్వహించబడుతోంది.
ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, జేసీ వెంకటరావు,డీఈవో నాగమణి, డాక్టర్ వెంకటేశ్వరరావు రెడ్ క్రాస్ ప్రతినిధులు హాజరయ్యారు