భారత్ రాష్ట్ర సమితి కార్యాలయం ప్రారంభోత్సవానికి ముందే ఆ పార్టీకి న్యూ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్ డీఎంసీ) అధికారులు షాక్ ఇచ్చారు. సర్దార్ పటేల్మార్గ్లో పార్టీ కార్యాలయాన్ని రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించబోతున్న సందర్భంగా అక్కడ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, హోర్డింగ్లను బీఆర్ఎస్ నేతలు, మద్దతుదారులు ఏర్పాటు చేశారు. అయితే కార్యాలయం ప్రారంభోత్సవానికి ముందే వాటిని ఎన్డీఎంసీ అధికారులు తొలగించారు. వీఐపీలు తిరిగే ప్రాంతం కావడంతో పాటు విమానాశ్రయానికి వెళ్లే ప్రధాన రహదారి కావడంతో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను, హోర్డింగ్లను తొలగించామని అధికారులు స్పష్టం చేశారు.
previous post