37.2 C
Hyderabad
April 26, 2024 19: 03 PM
Slider ప్రత్యేకం

చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ తో మంత్రి కేటీఆర్ సమావేశం

minister ktr 27

భారతదేశ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్ తో మంత్రి కే తారకరామారావు సమావేశమయ్యారు. హైదరాబాద్ లో పర్యటిస్తున్న చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ ఈరోజు ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక రంగంలో తీసుకున్న చర్యలు, పెట్టుబడుల సేకరణ కోసం చేస్తున్న ప్రయత్నాలను, ఈ దిశగా అందుకున్న విజయాలను అడ్వైజర్ కి వివరించారు. ఈ సందర్భంగా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రాధాన్యతలను సుబ్రమణ్యన్  తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకునే విధాన పరమైన నిర్ణయాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ లాంటి రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా కేటీఆర్, సుబ్రహ్మణ్యన్ కు సూచించారు. గతంలో హైదరాబాద్ ఐ యస్ బి లో పనిచేస్తున్న నాటి నుంచి కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్ తో తనకు మంచి బంధం ఉందన్న కేటీఆర్, ఆయన ఆధ్వర్యంలో భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Related posts

ప్రచురణార్ధం

Bhavani

కౌలు రైతు కుటుంబానికి పవన్ కళ్యాణ్ అండ….

Satyam NEWS

బీఆర్ఎస్ గెలవాలని అజ్మీర్ దర్గాలో చాదర్ సమర్పణ

Satyam NEWS

Leave a Comment