హైదరాబాద్ కూకట్ పల్లిలోని జై భారత్ మాత సేవా సమితి ప్రధాన కార్యాలయం లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. బుధవారం భాగ్యనగర్ కాలనీ లోని జై భారత్ సేవా సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు లాద్దే నాగరాజు ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సుధా పద్మిని, ప్రధాన కార్యదర్శి ఎర్రవల్లి ప్రభాకర్, కార్యదర్శి ఎం.విఠల్, శేర్లింగంపల్లి మీడియా ఇంచార్జ్ అంబాల మహేష్ గౌడ్, వై. వెంకటరమణ, నరసమ్మ, అంజలి, సనత్ నగర్ దేవి, రాంచందర్, లద్దే రాకేష్, తదితరులు పాల్గొన్నారు.