‘‘జగన్ రెడ్డి మీ తప్పులను ఎత్తి చూపి న్యాయం చేయమంటే దౌర్జన్యం చేస్తారా..?మొన్న దళితులు,నిన్న మహిళలు నేడు మీ కన్ను విద్యార్థుల మీద పడిందా…?తమ కాలేజ్ కోసం శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థుల మీద ఖాకీలను ఊసుగొల్పి రక్తం వచ్చేలా కొట్టిస్తారా..ఎయిడెడ్ కళాశాల ప్రైవేటీకరణ ఆపాలంటూ నిరసన తెలపడం కూడా రాజారెడ్డి రాజ్యాంగంలో నేరమా. ఇదేమి నియంత పాలన..’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు గుంటూరు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవిందబాబు.
గాయపడిన విద్యార్థులకు సత్వరమే మెరుగైన చికిత్స అందించాలని ఆయన కోరారు. ఈ ఘటనలో పాల్గొన్న పోలీసులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగేవరకు తెలుగుదేశం పార్టీ వారికి అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ఎయిడెడ్ విద్యా వ్యవస్థను ధ్వంసం చేసే నిర్ణయాలను వెంటనే వైసీపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, ఇచ్చిన జీవోలను రద్దు చేయాలని డాక్టర్ చదలవాడ అన్నారు. లేకుంటే విద్యార్థులతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు మెట్టు వేంకటేశ్వర్ రెడ్డి,చల్లా సుబ్బారావు,బడే బాబు,తెలుగు యువత నాయకులు మెడబలిమి నవీన్,శాఖమురి మారుతి,గంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నాగుర్ పాల్గొన్నారు.