స్పందన పిటీషన్లకు ప్రాపర్ పరిష్కారం చూపాలని అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి అన్నారు. నేడు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ నిర్వహించిన “స్పందన” కార్యక్రమానికి జిల్లా మూలల నుండి విచ్చేసిన ప్రజలు 97 పిటీషన్లు అందజేశారు. ప్రతీ పిటీషనర్ తో జిల్లా ఎస్పీ ముఖాముఖిగా మాట్లాడి సమస్యలను లోతుగా విన్నారు.
కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, చిన్న చిన్న వివాదాలు, తదితర సమస్యలను విన్నవించారు. చట్టపరిధిలో సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని సంబంధిత పోలీసు అధికారులకు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. దేవా చారిటబుల్ ట్రస్టు సహకారంతో స్పందన పిటీషనర్లకు ఉచిత భోజన సౌకర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగేంద్రుడు, తదితరులు పాల్గొన్నారు.