సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం లోని అంబేద్కర్ కాలనీలో గల ప్రత్యేక ఎస్టీ శ్మశాన వాటికను లంబాడీ హక్కుల పోరాట సమితి ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి తేజావత్ సైదులు నాయక్ ఆధ్వర్యంలో గిరిజన నాయకులందరితో కలిసి గురువారం పరిశీలించారు.
ఈ సందర్భంగా తేజావత్ సైదులు నాయక్ మాట్లాడుతూ గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి నిధులు,మున్సిపల్ కౌన్సిలర్ తేజావత్ రవి నాయక్ 13వ, ఫైనాన్స్ నిధులతో బోరు,వాటర్ ట్యాంకులు,నల్లాలు,గదులను ఏర్పాటు చేయటం జరిగిందని,వాటికి సరైన పర్యవేక్షణ లేక నల్లాలు,బోర్ మోటర్ స్టాటర్ బాక్సులు,వైర్లు దొంగలు దొంగిలించారని,బైపాస్ రోడ్డు నుండి నేరుగా శ్మశానవాటికకు దారి లేక ఎవరైనా గిరిజనులు చనిపోతే వ్యవసాయ పొలాల వెంట నడుచుకుంటూ పోవాల్సి వస్తుందని, వీధి దీపాలు లేక రాత్రి సమయంలో అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, కంప చెట్లు పెరిగి దహన సంస్కారాలకు ఇబ్బందులు అవుతున్నాయని,త్వరలో స్థానిక గిరిజనుల ఆధ్వర్యంలో శ్మశాన వాటిక పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ తేజావత్ రవి నాయక్,పట్టణ లంబాడా సంఘం అధ్యక్షుడు బాణోతు వెంకటేశ్వర్లు నాయక్,సీనియర్ లంబాడ నాయకులు బానోతు చంద్రు నాయక్, అవురేని శోభన్,షెక్ సలీంబాబా,బాణోతు వినయ్ నాయక్,బాణోతు వెంకటేశ్ నాయక్,బాణోతు శివ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్