40.2 C
Hyderabad
May 6, 2024 17: 18 PM
Slider పశ్చిమగోదావరి

యూట్యూబ్ రిపోర్టర్ వేధింపులు: ఒకరి ఆత్మహత్యాయత్నం

#murali

యూ ట్యూబ్ న్యూస్ ఛానెల్ రిపోర్టర్ అని చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తుండటంతో బియ్యం వ్యాపారి ఒకరు ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. యూట్యూబ్ ఛానెల్  రిపోర్టర్ పేరుతో ఒక వ్యక్తి మురళి అనే  రైస్ వ్యాపారిని బెదిరించి బ్లాక్ మెయిల్ చేశాడు. లక్ష రూపాయలు ఇమ్మని బెదిరించడంతో అతనికి ఏం చేయాలో తోచలేదు. దాంతో అతను పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని చికిత్స కోసం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అతడు ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. పోలీసులు మెడికో లీగల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నకిలీ విలేకరిని తక్షణమే అరెస్టు చేసి శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Related posts

వైన్ షాపు కు అనుమతులు నిలిపివేయాలంటూ సంతకాల సేకరణ

Satyam NEWS

ఏకగ్రీవంగా గౌడ సంఘం ఎన్నికలు

Satyam NEWS

కాంగ్రెస్ లో చేరిన సదాశివనగర్ వైస్ ఎంపీపీ

Satyam NEWS

Leave a Comment