అంతర్గత విబేధాలతో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల వైస్ ఎంపీపీ గాదారి శ్రీనివాస్ రెడ్డి ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గత నెల 23 న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించడంతో పాటు పార్టీలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జడ్పీటీసీలకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని ఆరోపించారు. అందుకే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నానని, ఓటేసి గెలిపించిన ప్రజలు కోరితే పదవికి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు. నేడు టీపీసీసీ ఐటి సెల్ చైర్మన్ మదన్ మోహన్ రావు సారథ్యంలో పార్టీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు లింగగౌడ్, మాజీ కో అప్షన్ మెంబర్ ఇర్షాద్, గాంధారి నాయకులు పరమేష్ పాల్గొన్నారు.
previous post