32వ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఏపీఎస్ఆర్టీసీ నరసరావుపేట డిపో లో ఘనంగా నిర్వహించారు. నేడు జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బి అనిల్ కుమార్ విచ్చేశారు.
ఈ సభకు డిపో మేనేజర్ ఎస్.కె అబ్దుల్ సలామ్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బి అనిల్ కుమార్ మాట్లాడుతూ డ్రైవర్లు వాహనం నడిపేటప్పుడు ఏకాగ్రత చాలా అవసరం అని తెలిపారు.
అలాగే టూవీలర్ నడిపేవాళ్ళు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని సూచించారు. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదాలు జరగడానికి అవకాశం ఎక్కువ అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో అన్ని యూనియన్ల నాయకులు సూపర్వైజర్లు డ్రైవర్లు, గ్యారేజీ కార్మికులు పాల్గొన్నారు