బాగ్ అంబర్పేట్ డివిజన్ కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి పాముల బస్తి లో వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించడం జరిగింది.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ జిహెచ్ఎంసి సిబ్బంది రోడ్డు మీద ఎటువంటి గుంతలు గాని మరియు చెత్త చెదారం లేకుండా చూడవలసిందిగా అధికారులకు తెలిపారు. ఆర్టికల్చర్ సిబ్బందికి ఎక్కడైనా చెట్టు కొమ్మలు ఇబ్బందిగా ఉంటే తొలగించాలని ఆదేశించారు. అదేవిధంగా వీధి దీపాలు అన్ని వెలిగే విధంగా ఎప్పటికప్పుడు తొందరగా పరిష్కారం చేయాలని జిహెచ్ఎంసి అధికారులను ఆదేశించారు. బస్తీలలో మరియు కాలనీలో ఎటువంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుపోయి పరిష్కరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ అధ్యక్షులు చుక్క జగన్, మిర్యాల శ్రీనివాస్,రమేష్ ముదిరాజ్, గోవింద్ అర్జున్, వెంకటేష్ మరియు వివిధ శాఖ అధికారులు,బస్తీ వాసులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట్