29.7 C
Hyderabad
May 1, 2024 03: 30 AM
Slider గుంటూరు

అమరావతి కోసం ఇద్దరు యువకుల దీక్ష భగ్నం

amaravathi 10

వైసిపికి చెందిన 151 మంది ఎమ్మెల్యేలకు కనువిప్పు కలిగి రాజధానిపై మనసు మార్చుకోవాలని ఇద్దరు యువకులు చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు ఆదివారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో భగ్నం చేశారు. వెలగపూడిలో బొర్రా రవి, తాడికొండ శ్రీకర్‌ 151 గంటల దీక్షను చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం నాటికి వారి ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. బీపీ, చక్కెర స్థాయులు పడిపోయాయని వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి దీక్షను భగ్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులను రాజధాని రైతులు, మహిళలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు బలవంతంగా అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.

Related posts

ఉప్పల్ ప్రెస్ క్లబ్ లో గణనాధునికి పూజలు నిర్వహించిన కార్పొరేటర్లు

Satyam NEWS

కరోనా వేళ సంక్షేమ మార్గంలో నిర్మలమ్మ బడ్జెట్

Satyam NEWS

నా భూమి ఆక్రమిస్తున్నారు అధికారులూ కాపాడండి

Satyam NEWS

Leave a Comment