భూమి కోసం , భుక్తి కోసం, విముక్తి కోసం , అసమాన ధైర్యసాహసాలు ,విస్తృత పోరాటం చేసిన ధీశాలి చిట్యాల (చాకలి) ఐలమ్మ అని తెరాస రాష్ట్ర యువజన కార్యదర్శి కనకరాజ్ గౌడ్ అన్నారు. శనివారం చిట్యాల (చాకలి) ఐలమ్మ 37 వ
వర్ధంతి సందర్భంగా యువజన కార్యదర్శి కనకరాజ్ గౌడ్ ఈ సి ఐ ఎల్ చౌరస్తా లోని ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం మేడ్చెల్ జిల్లా సంయుక్త కార్యదర్శి మచ్చ పాండు గౌడ్ , పవన్ , ప్రభాకర్ , మోహన్, రజక సంఘము నాయకులు యాకయ్య తదితరులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి