30.7 C
Hyderabad
May 5, 2024 04: 27 AM
Slider ఆంధ్రప్రదేశ్

జెండర్ ప్రాబ్లెమ్ : ఆడంగి వెధవల్లా వెనక దాక్కుంటున్నారా?

roja comments

కొందరు రాజకీయనేతలు ఆడవాళ్లను ముందుపెట్టి ఉద్యమం చేయిస్తూ ఆడంగి వెధవల్లా వెనక దాక్కుంటున్నారా? అని వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఆడవాళ్లను రోడ్లపైకి పంపించి పోలీసులు కొట్టారంటూ దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని ‘అమరావతిలో మగవాళ్లు లేరా? వాళ్లకు ఉద్యమాలు చేసే దమ్ములేదా? మీరు చేసిన తప్పులకు ఆడవాళ్లను ఎందుకు బలిచేస్తున్నారు?’ అంటూ ఆమె ప్రశ్నించారు.

అమరావతి ప్రాంత మహిళలందరూ స్వార్థంతోనే ఉద్యమాలు చేస్తున్నారని ఆరోపించిన రోజా,చంద్రబాబు లాంటి వ్యక్తి చిత్తూరు జిల్లాలో పుట్టినందుకు తాము సిగ్గుపడుతున్నామని వాపోయారు.. రాజధాని అంశంపై టీడీపీ నేతలు ఇంత రాద్ధాంతం చేస్తున్నారని, సీఎం జగన్ కనుక కోరుకుంటే రాజధానిని కడపలో ఏర్పాటు చేసుకునేవారని రోజా వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోని కూకట్ పల్లి నుంచి ఇక్కడికి బస్సుల్లో వచ్చి ధర్నాలు చేస్తున్నారని అన్నారు.

Related posts

ఆయుష్మాన్ భారత్ ను కేసీఆర్ ఎందుకు అమలు చేయడం లేదు?

Satyam NEWS

22న లోకేష్ వరినాటు బొమ్మ ఆవిష్కరణ

Bhavani

కరోనా మృతుల కుటుంబాలకు రూ.15లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి

Satyam NEWS

Leave a Comment