లోకేష్ బాబు వరి నాటు బొమ్మ ప్రారంభోత్సవానికి తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబు రాజేంద్రప్రసాద్ ను అమరావతి జేఏసీ నేత పులిచిన్న గారిని ఆహ్వానించారు. ఈరోజు ఉయ్యూరు లోని మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన పులిచిన్న ఆయనను శాలువాతో సత్కరించారు.
ఈనెల 22వ తారీఖున గుంటూరు జిల్లా, వేమూరు నియోజకవర్గం,కూచిపూడి గ్రామంలో ఎకరం పొలంలో లోకేష్ బాబు వరి నాటు బొమ్మ ప్రారంభోత్సవానికి రమ్మని ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఎకరం పొలంలో ఒక అద్భుతమైన వరి నాటు లోకేష్ బాబు బొమ్మను చిత్రీకరించడం పులి చిన్నాకు పార్టీపై, లోకేష్ బాబు పై అభిమానానికి ప్రతీక అని అన్నారు.
అంతేకాక ఆ బొమ్మ ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం సంతోషకరమని, అమరావతి ఉద్యమంలో కూడా పులిచిన్న చాలా యాక్టివ్ గా పని చేశారని రాజేంద్రప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో వల్లూరి కిరణ్, భాగ్యరాజ్, వికాస్, అశోక్, పవన్ తదితరులు పాల్గొన్నారు.