28.7 C
Hyderabad
May 5, 2024 10: 46 AM
Slider కర్నూలు

వైసీపీ పార్టీకి చెందిన గూండాలపై రౌడీషీట్ తెరవాలి

#ramakrishna

కర్నూలు జిల్లా, క్రిష్ణగిరి మండలం, బి బొంతరాళ్ల గ్రామానికి చెందిన సిపిఐ సీనియర్ కార్యకర్త కూర్మగిరి పెద్ద మాదన్న హత్యను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. పెద్ద మాదన్నను హత్య చేసిన వైసిపి గుండాలను తక్షణమే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బండిపై ఉన్న పశుగ్రాసాన్ని మేకలు మేసినందుకు దుర్మార్గంగా మాదన్నను నిర్బంధించి, మారణాయుధాలతో దాడి చేసి, హత్య చేయటం కిరాతకం అని ఆయన అన్నారు. కులాల మధ్య చిచ్చు పెడుతున్న నవీనపాటి సోదరులపై రౌడీషీట్ తెరవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. కుర్మగిరి పెద్ద మాదన్న కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని, వైసిపి హత్యా రాజకీయాలను ఖండిస్తున్నామని రామకృష్ణ అన్నారు.

Related posts

ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడానికి ఉద్యమం

Satyam NEWS

నూతన కలెక్టరేట్ పనులు త్వరగా పూర్తి చేయాలి

Satyam NEWS

పెండింగ్‌ చలాన్ రాయితీలను వినియోగించుకోవాలి

Sub Editor 2

Leave a Comment