కోడేరు మండలం నార్యానాయక్ తాండా కు చెందిన లక్ష్మి, దేవ్ సింగ్ దపంతుల కుమార్తె సంవత్సరం వయస్సు ఉన్న చిన్నారి రిషి తీవ్రమైన క్యాన్సర్ వ్యాధి తో హైద్రాబాద్ లోని రెయిన్ బో ఆసుపత్రిలో చికిత్స పోందుతోంది. చిన్నారికి వైద్యం చేయించలేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న తల్లిదండ్రులకు పేద ప్రజల ప్రాణదాత ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి ధైర్యం చెప్పి వైద్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం నుండి 6,00,000 (ఆరు లక్షల రూపాయల) ఎల్వోసీ ని శుక్రవారం తన స్వగృహం లో బాధిత కుటుంబానికి గ్రామ సర్పంచ్ బాస్కర్ నాయక్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మహేశ్వరరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజశేఖర్ గౌడ్, గ్రామ నాయకులు సోమ్లానాయక్ లతో కలసి అందజేశారు. నియోజకవర్గంలోని ప్రజల సంక్షేమం కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెల్లడించారు.