మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ ఏఎస్ రావు నగర్ డివిజన్ లో రాధికా చౌరస్తాలోని ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ వద్ద కూల్చివేత వ్యర్ధాలను వేసినందుకు మాల్ యజమానికి ఆదివారం కాప్రా సర్కిల్ అధికారులు రూ. 10 వేలు ఫైన్ వేశారు.
ఈ సందర్భంగా సర్కిల్ డి ఈ చందన, శానిటరీ సూపర్ వైజర్ నాగరాజు లు మాట్లాడుతూ వ్యాపార వాణిజ్య సముదాయాల వద్ద నిర్వాహకులు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు కూల్చివేత వేసినా, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోకున్న చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మంజుల, జవాను సత్తయ్య, శివ తదితరులు పాల్గొన్నారు.