గుంటూరు జిల్లా నరసరావుపేట చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆత్మకూరి రాజేంద్రప్రసాద్ కి నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నియామక పత్రాన్ని అందచేశారు.
ఈ సందర్భంగా గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ కొణిజేటి రోశయ్య ఆశీస్సులతో నరసరావుపేట చాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థ స్థాపించారని తెలిపారు. గత 12 సంవత్సరాలుగా సేవలందిస్తున్న ఈ సంస్థ కు నూతన కమిటీ అధ్యక్షునిగా ఆత్మకూరు రాజేంద్ర ప్రసాద్ ను ఎన్నుకోవడం అభినందనీయమని అన్నారు.
సమాజంలో కష్టపడి పనిచేసిన వారికి ఎప్పుడూ మంచి గుర్తింపు లభిస్తుందని, అధ్యక్షునిగా నూతన ఉత్సాహంతో పనిచేసి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలని అభినందించారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకులు చితిరాల గురు పెద్దన్న, అధ్యక్షులు ఆత్మకూరు రాజేంద్రప్రసాద్ చిత్రాల బదరీ నాథ్, తుమ్మలపెంట రామచంద్ర రావు, ఆత్మకూరి ఆనంద్, కొ త్తూరి సుబ్బారావు, పుప్పాల శివప్రసాద్, కొప్పురావూరి నాగరాజు, తాటి కొండ కోటేశ్వరరావు, పుప్పాల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.