28.7 C
Hyderabad
April 28, 2024 10: 53 AM
Slider గుంటూరు

నరసరావుపేట చాంబర్ ఆఫ్ కామర్స్ కు కొత్త అధ్యక్షుడు

#chamber of commerc

గుంటూరు జిల్లా నరసరావుపేట చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆత్మకూరి రాజేంద్రప్రసాద్ కి నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నియామక పత్రాన్ని అందచేశారు.

ఈ సందర్భంగా గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ కొణిజేటి రోశయ్య ఆశీస్సులతో  నరసరావుపేట చాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థ స్థాపించారని తెలిపారు. గత 12 సంవత్సరాలుగా సేవలందిస్తున్న ఈ సంస్థ కు నూతన కమిటీ  అధ్యక్షునిగా ఆత్మకూరు రాజేంద్ర ప్రసాద్ ను ఎన్నుకోవడం అభినందనీయమని అన్నారు.

సమాజంలో కష్టపడి పనిచేసిన వారికి ఎప్పుడూ మంచి గుర్తింపు లభిస్తుందని, అధ్యక్షునిగా నూతన ఉత్సాహంతో పనిచేసి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలని అభినందించారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకులు చితిరాల గురు పెద్దన్న, అధ్యక్షులు ఆత్మకూరు రాజేంద్రప్రసాద్ చిత్రాల బదరీ నాథ్, తుమ్మలపెంట రామచంద్ర రావు, ఆత్మకూరి ఆనంద్, కొ త్తూరి సుబ్బారావు, పుప్పాల శివప్రసాద్, కొప్పురావూరి నాగరాజు, తాటి కొండ కోటేశ్వరరావు, పుప్పాల  కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

నాన్న ఓ ప్రేమసాగరం

Satyam NEWS

కేసిఆర్ గొప్ప నాయకుడు

Sub Editor

మా వద్ద 24 గంటలు ఇసుక సప్లయ్ చేయబడును

Satyam NEWS

Leave a Comment