28.7 C
Hyderabad
April 27, 2024 03: 21 AM
Slider మహబూబ్ నగర్

ఆసరా పెన్షన్ దరఖాస్తులకు మరో అవకాశం ఇచ్చిన ప్రభుత్వం

#nagarkurnool

ఆసరా పెన్షన్ కు 57 సంవత్సరాల వయస్సు నిండిన పేద వారు ఈ సేవా లేదా మీసేవ ద్వారా అన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని నాగర్ కర్నూల్ జిలా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ నేడోక ప్రకటన లో తెలిపారు. ఆగష్టు 14 నుండి 31 వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకునేందుకు ముందుగా అవకాశం ఇచ్చారు.

అయితే అప్పుడు దరఖాస్తు చేసుకోలేని  వారికి అక్టోబర్ 11 నుంచి 30 వరకు అన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించినట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకునే తేదీకి 57 సంవత్సరాలు నిండి ఉన్న పేద  వారు ఆసరా పెన్షన్ దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ప్రభుత్వం కల్పించిన ఈ సదవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

Related posts

కొత్తపల్లి శ్రీనివాస్ ను ఘనంగా సన్మానించిన దహేగం

Satyam NEWS

నేనున్నా మీకోసం కార్యక్రమం పునఃప్రారంభం:

Satyam NEWS

గరుడ వాహన సేవలో సౌమ్యనాధ స్వామి….

Satyam NEWS

Leave a Comment