కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి నేడు హైదరాబాద్ అంబర్ పేట్ నియోజకవర్గంలో పర్యటించారు. గోల్నాక డివిజన్ లోని శంకర్ నగర్ కమిటీ హాల్, గంగానగర్ లో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ లను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ఆతిథులుగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు బస్తీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్ పేట్