కడప జిల్లా మైదుకూరు- కడప జాతీయ రహదారి పై భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో ఆర్టీసీ బస్సు ట్రాక్టర్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదం లో నలుగురికి గాయాలు తగిలాయి. ఆగి ఉన్న ఇటుకల ట్రాక్టర్ ను తెలంగాణ ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సులోని ఇరువురు డ్రైవర్లకు గాయాలు కాగా మరో ఇద్దరు ప్రయాణికులకు గాయాలు తగిలాయి. గాయపడిన వారిని 108 అంబులెన్సు లో కడప రిమ్స్ ఆసుపత్రి కి తరలించారు.
previous post
next post