బలమైన దేశం ఏర్పాటుకు తొలి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ విశేష కృషి చేశారని గూడూరు రూరల్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దశరథ రామారావు తెలిపారు ఒకే జాతి ఒకే దేశం ఉండాలన్న ఆకాంక్షకు అనుగుణంగా ఆయన విశేష కృషి చేసినట్లు చెప్పారు నా ఆశయ సాధనలో ప్రతి ఒక్కరు నడవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఏక్తా దినోత్స్ పురస్కరించుకుని రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గూడూరు పట్టణంలో ఈ కార్యక్రమం జరిగింది. గూడూరు పట్టణ రూరల్ పోలీస్ సిబ్బంది పాత బస్టాండ్ నుండి సంఘం ధియేటర్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. వన్ టౌన్ సిఐ హజరత్ బాబు, రూరల్ సీఐ దశరథ రామారావు రూరల్ ఎస్ఐ బ్రహ్మ నాయుడు వన్ టౌన్ ఎస్ఐ పవన్ పాల్గొన్నారు