36.2 C
Hyderabad
May 15, 2024 18: 29 PM
Slider తెలంగాణ

కేసీఆర్ కే కార్మికులు డెడ్ లైన్ పెట్టేరోజు వస్తుంది

kol RTC

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కొల్లాపూర్ ఆర్టీసీ డిపో కార్మికులు డిమాండ్ చేశారు. తాహసిల్దార్ విజయ రెడ్డి మృతికి కొల్లాపూర్ ఆర్టీసీ డిపో కార్మికులు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం 32వ రోజు  తాహసిల్దార్  కార్యాలయం కు ధర్నా ప్రాంతం నుండి ర్యాలీగా బయలుదేరి విజయ రెడ్డి మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఎన్టీఆర్ చౌరస్తా కు ర్యాలీగా వెళ్లి మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా కో కన్వీనర్ రామయ్య మాట్లాడారు. టిడిపి మండల అధ్యక్షులు ఉడుత రామస్వామి ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కి ఆర్టీసీ కార్మికుల సమస్యలు కనిపించడం లేదా? అని ఆయన ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులు విజయం సాధించే రోజు దగ్గరకు వచ్చిందన్నారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యోగుల ప్రాణాలు పోతుంటే కేసీఆర్ కు కనిపించడం లేదన్నారు. కేసీఆర్ కు ప్రభుత్వానికి ఉద్యోగులు డెడ్ లైన్ ఇచ్చే రోజు వస్తుందన్నారు.

Related posts

పిఎఫ్‌ఐ నిషేధంపై మొత్తుకుంటున్న పాకిస్తాన్

Satyam NEWS

తస్లీమా ట్వీట్స్:అక్బరుద్దీన్ మంచి మనిషిగా మారాడా

Satyam NEWS

మానవత్వాన్ని చాటుకున్న నరసరావుపేట ఎమ్మెల్యే

Satyam NEWS

Leave a Comment