ముఖ్య మంత్రి కెసిఆర్ ను కలిసి గుడి కి నిధులు మంజూరు చేయమని కోరిన ఎం ఐ ఎం నేత ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసి తో నెటిజెన్ లు ఓ అట ఆడుకుంటున్నారు. గతంలో హిందువుల పట్ల చులకనగా మాట్లాడటమే కాక 15 నిమిషాలు పోలీసులు కళ్లు మూసుకుంటే హిందూ, ముస్లిం జనాభాను సమానం చేస్తానన్నఅక్బరుద్దీన్ ఇంత మంచి మనిషిగా ఎప్పుడు మారిపోయారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.
తాజాగా బంగ్లాదేశ్ వివాదాస్పద రచయిత తస్లీమా నస్రీన్ కూడా అక్బరుద్దీన్పై విమర్శలు సంధించారు. అక్బరుద్దీన్ ఇప్పుడు మహంకాళి ఆలయ అభివృద్ధికి రూ. 10 కోట్లు ఇవ్వాలని కోరుతున్నాడు. అతడు ముఖానికి మాస్క్ తగిలించుకున్నాడా? లేకపోతే మంచిమనిషిగా మారాడా?’ అంటూ ఆమె ట్వీట్ చేశారు.