Slider ఆదిలాబాద్

రాఖీ పార్సిల్ కోసం ఆదిలాబాద్ డిపో ప్రత్యేక స్కీమ్

#RTC Adilabad

రాఖీ పండుగ సందర్భంగా ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ నూతన పథకం ప్రకారం ఎవరైనా రాఖీ పంపదలచుకుంటే ఆదిలాబాద్ బస్ స్టేషన్ లో ప్రత్యేక కౌంటర్ లో సంప్రదిస్తే చాలు. వారు కోరుకున్న వారికి రాఖీ చేరుతుంది.

కరోనా సమయంలో ప్రయాణాలు చేయలేని వారు తమ ఆత్మీయులకు రాఖీ బహుమతి పంపించుకోవచ్చు. జైనద్, బేల, గుడిహత్నూర్, ఇచ్చోడ మండలాల నుంచి రాఖీలు పంపదలచుకున్నవారు ఆర్టీసీ సిబ్బందిని సంప్రదించవచ్చు. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడికైనా రాఖీ పార్సిల్స్ పంవచ్చునని డిపో మేనేజర్ తెలిపారు.

250 గ్రాముల వరకూ కేవలం రూ.20 కే పార్సిల్ ను పంపుతారు. ఈ కార్యక్రమంలో ఇన్ చార్జి డిపో మేనేజర్ సి రాజేందర్, అసిస్టెంట్ మేనేజర్ రాజశేఖర్, సీనియర్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్, స్టేషన్ మేనేజర్ గణపతి ఓపిఆర్ఎస్ ఇన్ చార్జి హుస్సేన్ లు పాల్గొన్నారు.

Related posts

లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలి

Murali Krishna

కాంగ్రెస్ పై తప్పుడు ప్రచారం

mamatha

ఎస్సీ సబ్ ప్లాన్ అమలు గడువును పొడిగించాలి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!