ఆంధ్రాకు రావాలని ప్రజలు తనను ఆహ్వానిస్తున్నారని, పార్టీ ఆదేశిస్తే తాను ఏపి నుంచి పోటీకి సిద్ధమని కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి చెప్పారు. ఆంధ్రాలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని ఆమె జగన్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. బుధవారం విజయవాడ వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. అమరావతి రైతులు మూడేళ్లుగా ఆందోళన చేస్తుంటే సీఎం జగన్ పట్టించుకోకపోవటం దారుణమని ఆమె అన్నారు. నాలుగేళ్లుగా నరకం అనుభవిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు వచ్చే ఎన్నికల్లో అధికారపార్టీకి ఓటుతో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఏమైనా అంటే కులాలను అడ్డంపెట్టుకుని మాట్లాడుతున్నారని, ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు.
previous post