తిరుమలలో చిరుత సంచారం కలవరపెడుతోంది. దీంతో నడకమార్గంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మ.2గంటల తర్వాత 15 ఏళ్లలోపు పిల్లలకు అనుమతి ఉండదని తెలిపారు. ఏడో మైలు వద్ద చిన్న పిల్లల చేతికి ట్యాగ్లు వేస్తున్నారు. పిల్లలు తప్పిపోతే గుర్తించేందుకు ట్యాగ్లు వేస్తున్నట్లు తెలిపారు. ట్యాగ్పై పేరు, ఫోన్ నెంబర్, తల్లిదండ్రుల వివరాలు, పోలీసుల టోల్ ఫ్రీ నెంబర్ను పొందుపరుస్తున్నామన్నారు.
previous post
next post