సంగీత ప్రియులకు శుభవార్త. అందులోనూ ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం అభిమానులకు మరింత శుభవార్త. ఆయనకు కరోనా నెగెటీవ్ వచ్చింది.
గత పది రోజులుగా ఆయన కరోనా వైరస్ తో చెన్నైలోని ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. వెంటిలేటర్ పై ఆయన చికిత్స అందించారు.
అత్యంత సంక్లిష్టమైన దశకు చేరుకున్న ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై అందరూ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన అభిమానులు ఆయన ఆరోగ్యం కోసం ప్రార్ధనలు చేశారు.
వారి ప్రార్ధనల ఫలితంగా ఎస్ పి బాలసుబ్రహ్మణ్యంకు కరోనా నెగెటీవ్ వచ్చింది.