తెలంగాణలో కేసీఆర్ ఈ సారి గెలిచే అవకాశం లేదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన సంజయ్ రౌత్ కేసీఆర్ పై పలు విమర్శలు చేశారు. కేసీఆర్ మహారాష్ట్రలో ప్రర్యటిస్తుండగానే బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఎంపీలు నిన్న కాంగ్రెస్లో చేరారని ఆయన గుర్తు చేశారు. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
కేసీఆర్ రాజకీయ వ్యూహలను జాతీయ పార్టీలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తుంటే కేసీఆర్ మాత్రం మహారాష్ట్రను టార్గెట్ చేయడం వెనుక ఆయన అసలు టార్గెట్ ఏంటనే చర్చ జరుగుతోంది. కేసీఆర్ డ్రామాలు ఇలాగే కొనసాగితే ఆయన తెలంగాణను కూడా కోల్పోవాల్సి వస్తుందని సంజయ్ రౌత్ హెచ్చరించారు.